Apr 17 2024, 06:23
సంక్షేమంతో ప్రతి కుటుంబానికి జగనన్న చేరువయ్యారు.. జగనన్న దమ్ము, ధైర్యం ప్రజలే..వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
సంక్షేమంతో ప్రతి కుటుంబానికి జగనన్న చేరువయ్యారు.. జగనన్న దమ్ము, ధైర్యం ప్రజలే..వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికి చేరువయ్యారని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
శింగనమల మండలం బందార్లపల్లి, సలకంచెర్వు, ఇరువెందుల, నాయనవారిపల్లి, ఆనందరావుపేట, నిదనవాడ, రాచేపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన చేపట్టారు.
పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, మాజీ ఏడిసిసి చైర్మన్ తరిమెల కోనారెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎగ్గుల శ్రీనివాసులతో కలసి చేపట్టిన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామాల్లో ప్రజలు పూలమాలలు వేసి సత్కరించి, డప్పులు వాయిస్తూ డ్యాన్స్ లతో స్వాగతం పలికారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ప్రభుత్వం చేసిన మేలును వారికి వివరించారు. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాల లబ్దిని వివరించారు. ఇలానే సంక్షేమ పథకాలు రావాలంటే "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ..రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలకు వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు భౌతిక దాడులకు పాల్పడటం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పై భౌతికదాడిని ఖండిస్తూనే మరోవైపు హేళనగా మాట్లాడటం అతడి వక్రబుద్దికి నిదర్శనమన్నారు. చంద్రబాబు ప్రజలకు ఏమాత్రం మంచిని చేయలేదని, జగనన్న ఒక్కరే ఇంటింటికీ మంచి చేసి అందరికి చేరువయ్యారని స్పష్టం చేశారు.
పేదరిక నిర్మూలన కోసం జగనన్న తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం మరెవరివల్లా కాదన్నారు. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు అందిస్తున్న సాయం, మద్దతు ధరలతో రైతాంగం సంతోషంగా ఉందన్నారు. టిడిపి కేవలం తెలుగు దుష్ప్రచార పార్టీ అని చెబుతూ ఆ దుష్ప్రచారాలతోనే చంద్రబాబు జీవిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగిందంటే అది జగనన్న పాలనలోనే అని, అందుకే మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రజలు గెలిపించుకోబోతున్నారని తెలిపారు.
టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిక
మండల పరిధిలోని నాయనవారిపల్లి గ్రామంలో బెడుదూరి నాగరాజు, సరస్వతి, బాదే ప్రకాష్ టీడీపీ నుంచి వైసీపీ లోకి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమానికి ఆకర్షితులై చేరినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 18 2024, 06:59